శ్రీకృష్ణ నగర్ వెంచర్ ప్రారంభం
శ్రీకృష్ణ నగర్ వెంచర్ ప్రారంభం
Editor Desk
నార్కట్పల్లి, నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో శ్రీకృష్ణ నగర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీకృష్ణ నగర్ వెంచర్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. జాతీయ రహదారికి సమీపంలో, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు పుణ్యక్షేత్రం, నల్గొండ పట్టణానికి చేరువలో వెంచర్ను అభివృద్ధి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
డీటీసీపీ అనుమతులతో రూపొందించిన ఈ వెంచర్లో విశాలమైన సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్లైన్లు, చిల్డ్రన్స్ పార్క్, ఓవర్హెడ్ ట్యాంక్, సాగర్ నీటి సదుపాయం, 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణ వంటి సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. 175 గజాల ప్లాట్తో 1100 చదరపు అడుగుల డబుల్ బెడ్రూమ్ ఇల్లు రూ.36 లక్షలకు, 225 గజాల ప్లాట్తో 1300 చదరపు అడుగుల డబుల్ బెడ్రూమ్ ఇల్లు రూ.42 లక్షలకు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డిగూడెం సర్పంచ్ ఎలందుల లింగస్వామి, భూ యజమానులు జల్ల గణేష్, కొంగరి సత్యనారాయణ, సుదర్శన్, పాండరి, మేనేజింగ్ డైరెక్టర్ బాలాజీ నాయక్, అనంతరెడ్డి, గద్దర్ నరసన్న, సాగర్ల సైదులు, కొండూరు శంకర్, జనార్దన్ రెడ్డి, మందిర వెంకటరెడ్డి, శంకర్, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి