Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:14 AM

ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు

ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు

ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు
21-06-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* జీవో నెం. 44 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

​* ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరైందని ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.​చౌటుప్పల్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అదనపు కోర్టు ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ కోరగా, హైకోర్టు గతేడాదే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని చెప్పారు. అయితే ఏడాదిన్నరగా ఆర్థిక అనుమతులు పెండింగ్‌లో ఉన్న ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అనుమతులు ఇప్పించారన్నారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో నెం. 44 జారీ చేసిందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సబ్‌ కోర్టు ఏర్పాటు కోసం కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి న్యాయవాదులను సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. అదనపు కోర్టు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు

Article Image

​* జీవో నెం. 44 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

​* ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరైందని ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.​చౌటుప్పల్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అదనపు కోర్టు ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ కోరగా, హైకోర్టు గతేడాదే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని చెప్పారు. అయితే ఏడాదిన్నరగా ఆర్థిక అనుమతులు పెండింగ్‌లో ఉన్న ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అనుమతులు ఇప్పించారన్నారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో నెం. 44 జారీ చేసిందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సబ్‌ కోర్టు ఏర్పాటు కోసం కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి న్యాయవాదులను సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. అదనపు కోర్టు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News