ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
K.RAVI
* యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి: యోగా గురువులు పాండు, పాపయ్య
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ రోడ్డులో మార్నింగ్ వాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం అసోసియేషన్ సభ్యులు, స్థానిక చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వివిధ యోగాసనాలు వేశారు.ఈ సందర్భంగా యోగా గురువులు పాండు, పాపయ్యలు మాట్లాడుతూ.. యోగాను కేవలం జూన్ 21 ఒక్క రోజుకే పరిమితం చేయకూడదని హితవు పలికారు. శారీరక, మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ దీనిని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యకరమైన అలవాట్లను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి, మార్నింగ్ వాకింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెల్తురి జంగయ్య, ఓంకార్, ఉపాధ్యక్షులు ఉష్కాగుల వెంకటేష్, శ్రీశైలం, మనీ, కాసర్ల సత్య వర్ధన్ రెడ్డి, బండి వెంకటరెడ్డి, జయంత్ అశ్విత్, చింతల ప్రభాకర్ రెడ్డి, మెట్టు రామచంద్ర రెడ్డి, కళ్లెం నాగరాజు, ఉప్పునూతల గణేష్, జటంగి రాజు, రవి, ఉడుగు రమేష్, తోర్పునూరి సాయికుమార్, పోటు రవి, సిద్దు, బాలగోని మణి, చింతకింది గణేష్, జక్కర్తి శేఖర్, పొన్నాల సుల్తాన్, వెంకటేష్, చెరుకు చైతన్య, పొట్ట ప్రవీణ్ కుమార్, సిద్ధ గొని ఉపేందర్, పంతంగి అఖిల్, డబ్బేటి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి