Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 21, 2026 10:52 PM

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి
June 21, 2026 08:12 PM 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్‌బీనగర్, న్యూస్‌టుడే: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఎల్‌బీనగర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమల్ల రామ్ నరసింహ గౌడ్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాలు మరువలేనివని పేర్కొన్నారు.

రానున్న జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు కార్పొరేటర్ అభ్యర్థులుగా అవకాశం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. కార్యక్రమంలో కాచం సత్యనారాయణ గుప్తా, బీరెల్లి వెంకట్‌రెడ్డి, ఉప్పల శ్రవణ్‌కుమార్ గుప్తా, సాల్వాచారి, ఏలే పురేందర్ నేత, దాము మహేందర్ యాదవ్, కూర రమేష్ గుప్తా, చినం రమేష్ కురుమ, బండారు మల్లేష్ గౌడ్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News