ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి
ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి
Editor Desk
ఎల్బీనగర్, న్యూస్టుడే: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఎల్బీనగర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమల్ల రామ్ నరసింహ గౌడ్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాలు మరువలేనివని పేర్కొన్నారు.
రానున్న జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు కార్పొరేటర్ అభ్యర్థులుగా అవకాశం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. కార్యక్రమంలో కాచం సత్యనారాయణ గుప్తా, బీరెల్లి వెంకట్రెడ్డి, ఉప్పల శ్రవణ్కుమార్ గుప్తా, సాల్వాచారి, ఏలే పురేందర్ నేత, దాము మహేందర్ యాదవ్, కూర రమేష్ గుప్తా, చినం రమేష్ కురుమ, బండారు మల్లేష్ గౌడ్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి