Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:46 AM

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి
21-06-2026 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్‌బీనగర్, న్యూస్‌టుడే: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఎల్‌బీనగర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమల్ల రామ్ నరసింహ గౌడ్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాలు మరువలేనివని పేర్కొన్నారు.

రానున్న జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు కార్పొరేటర్ అభ్యర్థులుగా అవకాశం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. కార్యక్రమంలో కాచం సత్యనారాయణ గుప్తా, బీరెల్లి వెంకట్‌రెడ్డి, ఉప్పల శ్రవణ్‌కుమార్ గుప్తా, సాల్వాచారి, ఏలే పురేందర్ నేత, దాము మహేందర్ యాదవ్, కూర రమేష్ గుప్తా, చినం రమేష్ కురుమ, బండారు మల్లేష్ గౌడ్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

Article Image

ఎల్‌బీనగర్, న్యూస్‌టుడే: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఎల్‌బీనగర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమల్ల రామ్ నరసింహ గౌడ్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాలు మరువలేనివని పేర్కొన్నారు.

రానున్న జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు కార్పొరేటర్ అభ్యర్థులుగా అవకాశం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. కార్యక్రమంలో కాచం సత్యనారాయణ గుప్తా, బీరెల్లి వెంకట్‌రెడ్డి, ఉప్పల శ్రవణ్‌కుమార్ గుప్తా, సాల్వాచారి, ఏలే పురేందర్ నేత, దాము మహేందర్ యాదవ్, కూర రమేష్ గుప్తా, చినం రమేష్ కురుమ, బండారు మల్లేష్ గౌడ్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News