అవినీతి ఆందోళనకర స్థాయికి చేరింది ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అవసరం: గుత్తా సుఖేందర్రెడ్డి
అవినీతి ఆందోళనకర స్థాయికి చేరింది ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అవసరం: గుత్తా సుఖేందర్రెడ్డి
Editor Desk
నల్గొండ,: రాష్ట్రంలో అధికారుల్లో అవినీతి ఆందోళనకర స్థాయికి చేరిందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. గతంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలే ప్రజాప్రతినిధులుగా ఎదిగేవారని, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లే రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని వ్యాఖ్యానించారు.
చిన్నస్థాయి ఉద్యోగుల వద్ద కూడా కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వానికి అధికారులపై పూర్తి అజమాయిషీ ఉండాలని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగులకు తిరిగి పోస్టింగులు ఇవ్వొద్దని అభిప్రాయపడ్డారు.
రాజకీయ నాయకుల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని, మిగిలిన వారు ప్రజాసేవకే కట్టుబడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా అమలుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, సేద్యయోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి