Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 AM

కాన్సులేట్‌ రోడ్డుకు ‘ట్రంప్‌’ పేరు ప్రతిపాదన విరమించుకోవాలి

కాన్సులేట్‌ రోడ్డుకు ‘ట్రంప్‌’ పేరు ప్రతిపాదన విరమించుకోవాలి

కాన్సులేట్‌ రోడ్డుకు ‘ట్రంప్‌’ పేరు ప్రతిపాదన విరమించుకోవాలి
20-06-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌ బస్టాండ్‌ సమీపంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్‌ చేశారు. శనివారం చౌటుప్పల్‌ మండల కేంద్రంలో జిల్లా కోశాధికారి ఎండీ పాషా అధ్యక్షతన సీఐటీయూ మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అనంతరం కాన్సులేట్‌ రోడ్డుకు ట్రంప్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కార్మికులు, నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి చౌటుప్పల్‌ బస్టాండ్‌ సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.​ ముఖ్య అతిథిగా పాల్గొన్న కల్లూరి మల్లేశం మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నానక్‌రాంగూడలోని అమెరికా కాన్సులేట్‌ రోడ్డుకు ట్రంప్‌ పేరు పెట్టాలని చూడడం సరికాదన్నారు. పాలస్తీనా, ఇరాన్‌ దేశాల్లో వేలాది మంది మరణాలకు, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదలకు కారణమవుతూ.. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న వ్యక్తి పేరును ప్రతిపాదించడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎండీ పాషా, జిల్లా కమిటీ సభ్యులు జొన్నకంటి దేవయ్య, సంఘం నాయకులు మాండ్ర శ్రీను, గుడ్డేటి పాపయ్య, గడ్డం వెంకటేష్, టి. మల్లేష్, కోళ్ళ మల్లయ్య, ఎల్లయ్య, సంజీవ, నవనీత, పార్వతమ్మ, సుగుణమ్మ, జయమ్మ, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాన్సులేట్‌ రోడ్డుకు ‘ట్రంప్‌’ పేరు ప్రతిపాదన విరమించుకోవాలి

Article Image

చౌటుప్పల్‌ బస్టాండ్‌ సమీపంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్‌ చేశారు. శనివారం చౌటుప్పల్‌ మండల కేంద్రంలో జిల్లా కోశాధికారి ఎండీ పాషా అధ్యక్షతన సీఐటీయూ మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అనంతరం కాన్సులేట్‌ రోడ్డుకు ట్రంప్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కార్మికులు, నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి చౌటుప్పల్‌ బస్టాండ్‌ సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.​ ముఖ్య అతిథిగా పాల్గొన్న కల్లూరి మల్లేశం మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నానక్‌రాంగూడలోని అమెరికా కాన్సులేట్‌ రోడ్డుకు ట్రంప్‌ పేరు పెట్టాలని చూడడం సరికాదన్నారు. పాలస్తీనా, ఇరాన్‌ దేశాల్లో వేలాది మంది మరణాలకు, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదలకు కారణమవుతూ.. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న వ్యక్తి పేరును ప్రతిపాదించడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎండీ పాషా, జిల్లా కమిటీ సభ్యులు జొన్నకంటి దేవయ్య, సంఘం నాయకులు మాండ్ర శ్రీను, గుడ్డేటి పాపయ్య, గడ్డం వెంకటేష్, టి. మల్లేష్, కోళ్ళ మల్లయ్య, ఎల్లయ్య, సంజీవ, నవనీత, పార్వతమ్మ, సుగుణమ్మ, జయమ్మ, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News