కాన్సులేట్ రోడ్డుకు ‘ట్రంప్’ పేరు ప్రతిపాదన విరమించుకోవాలి
కాన్సులేట్ రోడ్డుకు ‘ట్రంప్’ పేరు ప్రతిపాదన విరమించుకోవాలి
K.RAVI
చౌటుప్పల్ బస్టాండ్ సమీపంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్ మండల కేంద్రంలో జిల్లా కోశాధికారి ఎండీ పాషా అధ్యక్షతన సీఐటీయూ మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అనంతరం కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కార్మికులు, నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి చౌటుప్పల్ బస్టాండ్ సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కల్లూరి మల్లేశం మాట్లాడుతూ.. హైదరాబాద్ నానక్రాంగూడలోని అమెరికా కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టాలని చూడడం సరికాదన్నారు. పాలస్తీనా, ఇరాన్ దేశాల్లో వేలాది మంది మరణాలకు, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణమవుతూ.. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న వ్యక్తి పేరును ప్రతిపాదించడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎండీ పాషా, జిల్లా కమిటీ సభ్యులు జొన్నకంటి దేవయ్య, సంఘం నాయకులు మాండ్ర శ్రీను, గుడ్డేటి పాపయ్య, గడ్డం వెంకటేష్, టి. మల్లేష్, కోళ్ళ మల్లయ్య, ఎల్లయ్య, సంజీవ, నవనీత, పార్వతమ్మ, సుగుణమ్మ, జయమ్మ, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి