ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి సమక్షంలో నూతన వాణిజ్య సముదాయం ప్రారంభం
ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి సమక్షంలో నూతన వాణిజ్య సముదాయం ప్రారంభం
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో రాయిపల్లి రోడ్డు నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎం వాణిజ్య సముదాయాన్ని మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, మాలదేవి శెట్కార్ దంపతులు, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్, వర్ష దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ప్రజలకు ఒకేచోట నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉండేలా ఈ వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్,ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాల్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు సుజనా చౌదరి, నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ సంజీవ్ రెడ్డి,జుక్కల్ శాసనసభ్యుడు లక్ష్మీకాంతరావు, పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి