Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్లగొండలో ఘోరం: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు! పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 10:15 PM

నల్లగొండలో ఘోరం: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు!

నల్లగొండలో ఘోరం: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు!

నల్లగొండలో ఘోరం:  ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు!
June 22, 2026 08:42 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో సోమవారం తీవ్ర కలకలం రేగింది. ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం స్థానికంగా పెద్ద దుమారాన్ని లేపింది. మృతులను మహమ్మద్ సుల్తాన్, ఆయన భార్య హసీనాతో పాటు మరో ఇద్దరిగా గుర్తించారు. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ కాలనీలోని సదరు ఇల్లు గత కొన్ని రోజులుగా మూసి ఉంచబడింది. అయితే, ఈరోజు ఆ ఇంటి నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా, లోపల నాలుగు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో పడి ఉన్నాయి. మృతదేహాలు బాగా దెబ్బతినడాన్ని బట్టి చూస్తే, వారు కనీసం నాలుగు రోజుల క్రితమే మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ​మృతుల్లో హసీనా స్థానిక ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, ఆమె భర్త మహమ్మద్ సుల్తాన్ ప్రకాశం బజార్‌లోని ఒక బ్యాగుల దుకాణంలో వ్యాపారంలో తోడుగా ఉంటున్నట్లు స్థానికులు వెల్లడించారు. వీరితో పాటు మరణించిన మిగతా ఇద్దరు ఎవరు? వారు వీరి బంధువులా కాదా? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ​ఘటన తీవ్రత దృష్ట్యా నల్లగొండ అదనపు ఎస్పీ (Addl SP) జి. రమేష్ క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించారు. ​"ఇది ఆత్మహత్యా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. పూర్తి విచారణ జరిపి త్వరలోనే అసలు నిజాలను వెల్లడిస్తామని అని అదనపు ఎస్పీ రమేష్ తెలిపారు. ​ఈ దారుణ ఘటనతో తెలంగాణ కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News