Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:05 PM

విద్యార్థుల అభ్యున్నతికి మాజీ అడిషనల్ ఎస్పీ బాలరాజ్ సహకారం

విద్యార్థుల అభ్యున్నతికి మాజీ అడిషనల్ ఎస్పీ బాలరాజ్ సహకారం

విద్యార్థుల అభ్యున్నతికి మాజీ అడిషనల్ ఎస్పీ బాలరాజ్ సహకారం
22-06-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండల పరిధిలోని షెల్గెరా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మాజీ అడిషనల్ ఎస్పీ బాలరాజ్ (మణికొండ, హైదరాబాద్) తన దాతృత్వాన్ని చాటుకుంటూ పాఠశాలలోని 125 మంది విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు.ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి రాజశేఖర్, జెడ్పిహెచ్ఎస్ శేల్గిరా ప్రధానోపాధ్యాయులు రాఘవేందర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేష్ కుమార్, ఉపాధ్యాయులు నర్సింలు, రాములు, విట్టల్, ప్రశాంతి, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యనే సమాజ అభివృద్ధికి మూలస్తంభమని, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే ప్రతి సహాయం దేశ భవిష్యత్తుకు పెట్టుబడితో సమానమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి చేయూతనందించిన బాలరాజ్ సేవాభావాన్ని కొనియాడుతూ, ఆయన చేపట్టిన ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమం మరెందరికో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ముందుకు వచ్చి సహకరించిన బాలరాజ్‌కు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

విద్యార్థుల అభ్యున్నతికి మాజీ అడిషనల్ ఎస్పీ బాలరాజ్ సహకారం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండల పరిధిలోని షెల్గెరా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మాజీ అడిషనల్ ఎస్పీ బాలరాజ్ (మణికొండ, హైదరాబాద్) తన దాతృత్వాన్ని చాటుకుంటూ పాఠశాలలోని 125 మంది విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు.ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి రాజశేఖర్, జెడ్పిహెచ్ఎస్ శేల్గిరా ప్రధానోపాధ్యాయులు రాఘవేందర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేష్ కుమార్, ఉపాధ్యాయులు నర్సింలు, రాములు, విట్టల్, ప్రశాంతి, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యనే సమాజ అభివృద్ధికి మూలస్తంభమని, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే ప్రతి సహాయం దేశ భవిష్యత్తుకు పెట్టుబడితో సమానమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి చేయూతనందించిన బాలరాజ్ సేవాభావాన్ని కొనియాడుతూ, ఆయన చేపట్టిన ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమం మరెందరికో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ముందుకు వచ్చి సహకరించిన బాలరాజ్‌కు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News