Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్లగొండలో ఘోరం: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు! పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 09:04 PM

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. యువతకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. యువతకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. యువతకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు
June 22, 2026 07:45 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జూన్ 26 అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించిన ఆయన, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీసి కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత, ప్రజల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఎస్సై కావేరి, ఎస్-ఎన్‌వైఏబీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News