డ్రగ్స్కు దూరంగా ఉండండి.. యువతకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు
డ్రగ్స్కు దూరంగా ఉండండి.. యువతకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు
Krishna
జూన్ 26 అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించిన ఆయన, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీసి కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత, ప్రజల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఎస్సై కావేరి, ఎస్-ఎన్వైఏబీ సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి