"అంబుజాకు బ్రేక్.. వీరేశానికి పాలాభిషేక్". "ఫ్యాక్టరీకి ఫుల్స్టాప్.. కాంగ్రెస్ సంబరాలు"
"అంబుజాకు బ్రేక్.. వీరేశానికి పాలాభిషేక్". "ఫ్యాక్టరీకి ఫుల్స్టాప్.. కాంగ్రెస్ సంబరాలు"
Editor Desk
ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు కాకుండా కృషి చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం చిత్రపటానికి సోమవారం రామన్నపేట పట్టణ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సుభాష్ సెంటర్ నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కాలుష్య కారకమైన అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా రామన్నపేట, కోమ్మాయిగూడెం, సిరిపురం, వెల్లంకి, బోగారం, పెద్దకాపర్తి తదితర గ్రామాల ప్రజలు, అఖిలపక్ష నాయకులు చేపట్టిన పోరాటానికి ఎమ్మెల్యే వేముల వీరేశం అండదండగా నిలిచారని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమ ఏర్పాటు కాకుండా అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుతో కాలుష్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించి వారి ప్రయోజనాలను కాపాడారని పేర్కొన్నారు. పరిశ్రమ ఏర్పాటు నిలిచిపోవడంతో రామన్నపేట ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని, తమకు ప్రజల కోసం పోరాడే నాయకుడు ఉన్నారనే విశ్వాసం మరింత పెరిగిందన్నారు.
ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో ఎమ్మెల్యే చూపిన చొరవకు గుర్తింపుగా పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి