Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:46 AM

"అంబుజాకు బ్రేక్.. వీరేశానికి పాలాభిషేక్". "ఫ్యాక్టరీకి ఫుల్‌స్టాప్.. కాంగ్రెస్ సంబరాలు"

"అంబుజాకు బ్రేక్.. వీరేశానికి పాలాభిషేక్". "ఫ్యాక్టరీకి ఫుల్‌స్టాప్.. కాంగ్రెస్ సంబరాలు"

"అంబుజాకు బ్రేక్.. వీరేశానికి పాలాభిషేక్". "ఫ్యాక్టరీకి ఫుల్‌స్టాప్.. కాంగ్రెస్ సంబరాలు"
22-06-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు కాకుండా కృషి చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం చిత్రపటానికి సోమవారం రామన్నపేట పట్టణ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సుభాష్ సెంటర్ నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కాలుష్య కారకమైన అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా రామన్నపేట, కోమ్మాయిగూడెం, సిరిపురం, వెల్లంకి, బోగారం, పెద్దకాపర్తి తదితర గ్రామాల ప్రజలు, అఖిలపక్ష నాయకులు చేపట్టిన పోరాటానికి ఎమ్మెల్యే వేముల వీరేశం అండదండగా నిలిచారని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమ ఏర్పాటు కాకుండా అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుతో కాలుష్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించి వారి ప్రయోజనాలను కాపాడారని పేర్కొన్నారు. పరిశ్రమ ఏర్పాటు నిలిచిపోవడంతో రామన్నపేట ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని, తమకు ప్రజల కోసం పోరాడే నాయకుడు ఉన్నారనే విశ్వాసం మరింత పెరిగిందన్నారు.

ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో ఎమ్మెల్యే చూపిన చొరవకు గుర్తింపుగా పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

"అంబుజాకు బ్రేక్.. వీరేశానికి పాలాభిషేక్". "ఫ్యాక్టరీకి ఫుల్‌స్టాప్.. కాంగ్రెస్ సంబరాలు"

Article Image

ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు కాకుండా కృషి చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం చిత్రపటానికి సోమవారం రామన్నపేట పట్టణ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సుభాష్ సెంటర్ నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కాలుష్య కారకమైన అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా రామన్నపేట, కోమ్మాయిగూడెం, సిరిపురం, వెల్లంకి, బోగారం, పెద్దకాపర్తి తదితర గ్రామాల ప్రజలు, అఖిలపక్ష నాయకులు చేపట్టిన పోరాటానికి ఎమ్మెల్యే వేముల వీరేశం అండదండగా నిలిచారని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమ ఏర్పాటు కాకుండా అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుతో కాలుష్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించి వారి ప్రయోజనాలను కాపాడారని పేర్కొన్నారు. పరిశ్రమ ఏర్పాటు నిలిచిపోవడంతో రామన్నపేట ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని, తమకు ప్రజల కోసం పోరాడే నాయకుడు ఉన్నారనే విశ్వాసం మరింత పెరిగిందన్నారు.

ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో ఎమ్మెల్యే చూపిన చొరవకు గుర్తింపుగా పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News