Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:45 AM

నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌వో ఆధ్వర్యంలో ధర్నా

నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌వో ఆధ్వర్యంలో ధర్నా

నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌వో ఆధ్వర్యంలో ధర్నా
22-06-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : ఆదోనిలోని నారాయణ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌వో విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నారాయణ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, పీడీఎస్‌వో రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ.. స్కూల్ ఫీజు, పుస్తకాలు, యూనిఫాంలు తదితర పేర్లతో తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అడ్మిషన్ సమయంలో ఒక విధంగా ఫీజులు చెబుతూ, తర్వాత వివిధ రకాల పేర్లతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

విద్యను వ్యాపారంగా మార్చి పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. పుస్తకాలు, యూనిఫాంలను తమ వద్దనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న అధిక ఫీజుల వసూళ్లపై విచారణ జరపాలని, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో అదనపు వసూళ్లను నిలిపివేయాలని, ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Sthanikam

నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌వో ఆధ్వర్యంలో ధర్నా

Article Image

ఆదోని, : ఆదోనిలోని నారాయణ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌వో విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నారాయణ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, పీడీఎస్‌వో రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ.. స్కూల్ ఫీజు, పుస్తకాలు, యూనిఫాంలు తదితర పేర్లతో తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అడ్మిషన్ సమయంలో ఒక విధంగా ఫీజులు చెబుతూ, తర్వాత వివిధ రకాల పేర్లతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

విద్యను వ్యాపారంగా మార్చి పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. పుస్తకాలు, యూనిఫాంలను తమ వద్దనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న అధిక ఫీజుల వసూళ్లపై విచారణ జరపాలని, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో అదనపు వసూళ్లను నిలిపివేయాలని, ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News