నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి డీఎస్ఎఫ్, పీడీఎస్వో ఆధ్వర్యంలో ధర్నా
నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి డీఎస్ఎఫ్, పీడీఎస్వో ఆధ్వర్యంలో ధర్నా
Editor Desk
ఆదోని, : ఆదోనిలోని నారాయణ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని డీఎస్ఎఫ్, పీడీఎస్వో విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నారాయణ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, పీడీఎస్వో రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ.. స్కూల్ ఫీజు, పుస్తకాలు, యూనిఫాంలు తదితర పేర్లతో తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అడ్మిషన్ సమయంలో ఒక విధంగా ఫీజులు చెబుతూ, తర్వాత వివిధ రకాల పేర్లతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
విద్యను వ్యాపారంగా మార్చి పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. పుస్తకాలు, యూనిఫాంలను తమ వద్దనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న అధిక ఫీజుల వసూళ్లపై విచారణ జరపాలని, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో అదనపు వసూళ్లను నిలిపివేయాలని, ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి