గ్రామ సేవకుల కోసం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్ ప్రత్యేక కానుక.. రూ.15 లక్షల బీమా
గ్రామ సేవకుల కోసం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్ ప్రత్యేక కానుక.. రూ.15 లక్షల బీమా
Editor Desk
రామన్నపేట మండలంలోని బోగారం గ్రామపంచాయతీ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బోగారం గ్రామ సర్పంచ్ కునురు సాయి కుమార్ గౌడ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరికీ రూ.15 లక్షల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించారు.
ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సిబ్బందికి బీమా పత్రాలను సర్పంచ్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండనక, వాననక గ్రామ ప్రజలకు సేవలందిస్తూ పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర పనుల్లో నిమగ్నమై ఉండే సిబ్బంది సంక్షేమం తమ బాధ్యత అని అన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ప్రమాదం జరిగినా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
సర్పంచ్ తీసుకున్న నిర్ణయంపై గ్రామపంచాయతీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు అండగా నిలిచేలా ప్రమాద బీమా సౌకర్యం కల్పించినందుకు సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధా, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి