Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:49 AM

గ్రామ సేవకుల కోసం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్ ప్రత్యేక కానుక.. రూ.15 లక్షల బీమా

గ్రామ సేవకుల కోసం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్ ప్రత్యేక కానుక.. రూ.15 లక్షల బీమా

గ్రామ సేవకుల కోసం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్ ప్రత్యేక కానుక.. రూ.15 లక్షల బీమా
22-06-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామపంచాయతీ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బోగారం గ్రామ సర్పంచ్ కునురు సాయి కుమార్ గౌడ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరికీ రూ.15 లక్షల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించారు.

ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సిబ్బందికి బీమా పత్రాలను సర్పంచ్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండనక, వాననక గ్రామ ప్రజలకు సేవలందిస్తూ పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర పనుల్లో నిమగ్నమై ఉండే సిబ్బంది సంక్షేమం తమ బాధ్యత అని అన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ప్రమాదం జరిగినా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

సర్పంచ్ తీసుకున్న నిర్ణయంపై గ్రామపంచాయతీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు అండగా నిలిచేలా ప్రమాద బీమా సౌకర్యం కల్పించినందుకు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధా, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

గ్రామ సేవకుల కోసం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్ ప్రత్యేక కానుక.. రూ.15 లక్షల బీమా

Article Image

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామపంచాయతీ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బోగారం గ్రామ సర్పంచ్ కునురు సాయి కుమార్ గౌడ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరికీ రూ.15 లక్షల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించారు.

ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సిబ్బందికి బీమా పత్రాలను సర్పంచ్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండనక, వాననక గ్రామ ప్రజలకు సేవలందిస్తూ పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర పనుల్లో నిమగ్నమై ఉండే సిబ్బంది సంక్షేమం తమ బాధ్యత అని అన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ప్రమాదం జరిగినా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

సర్పంచ్ తీసుకున్న నిర్ణయంపై గ్రామపంచాయతీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు అండగా నిలిచేలా ప్రమాద బీమా సౌకర్యం కల్పించినందుకు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధా, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News