జూనియర్ కళాశాలలో డ్రగ్స్కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ.
జూనియర్ కళాశాలలో డ్రగ్స్కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ.
Editor Desk
యువత మేలుకో.. డ్రగ్స్ మానుకో.
రామన్నపేట
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో సోమవారం మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఎస్ ఐ నాగరాజు, కళాశాల ప్రిన్సిపల్ సి. జగదీష్ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.
బిగ్ టీవీ వ్యాఖ్యాత నీలా నరసన్న తనదైన శైలిలో పాటలు, సందేశాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పించారు. ‘యువత మేలుకో–డ్రగ్స్ మానుకో’, ‘డ్రగ్స్ వద్దు–ఆరోగ్యం ముద్దు’, ‘డ్రగ్స్ మానుకో–జీవితాన్ని మలుచుకో’ వంటి నినాదాలతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఉప్పల నరసింహారావు, దొడ్డి అశోక్కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి