Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:06 PM

జూనియర్ కళాశాలలో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ.

జూనియర్ కళాశాలలో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ.

జూనియర్ కళాశాలలో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ.
June 22, 2026 02:32 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యువత మేలుకో.. డ్రగ్స్ మానుకో.

రామన్నపేట

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో సోమవారం మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఎస్ ఐ నాగరాజు, కళాశాల ప్రిన్సిపల్ సి. జగదీష్ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.

బిగ్ టీవీ వ్యాఖ్యాత నీలా నరసన్న తనదైన శైలిలో పాటలు, సందేశాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పించారు. ‘యువత మేలుకో–డ్రగ్స్ మానుకో’, ‘డ్రగ్స్ వద్దు–ఆరోగ్యం ముద్దు’, ‘డ్రగ్స్ మానుకో–జీవితాన్ని మలుచుకో’ వంటి నినాదాలతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు ఉప్పల నరసింహారావు, దొడ్డి అశోక్‌కుమార్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News