Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి హైస్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 07:37 PM

విశాల భారతి హైస్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

విశాల భారతి హైస్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

విశాల భారతి హైస్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
June 22, 2026 05:40 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* ఉత్సాహంగా ఆసనాలు వేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

చౌటుప్పల్ లోని విశాల భారతి హై స్కూల్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ఉత్సాహంగా సూర్య నమస్కారాలు, వివిధ యోగాసనాలను ప్రదర్శించారు.​పాఠశాల కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. యోగా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరమని, ప్రతి ఒక్కరూ దీనిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగ గురువు ఆచార్య బాలకృష్ణ అష్టాంగ యోగం యొక్క ప్రాముఖ్యతను వివరించగా, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని తెలిపారు. యోగా ఇన్‌స్ట్రక్టర్ ఝాన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, బి.ఎడ్. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అందరూ సంకల్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News