విశాల భారతి హైస్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
విశాల భారతి హైస్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
K.RAVI
* ఉత్సాహంగా ఆసనాలు వేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
చౌటుప్పల్ లోని విశాల భారతి హై స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ఉత్సాహంగా సూర్య నమస్కారాలు, వివిధ యోగాసనాలను ప్రదర్శించారు.పాఠశాల కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. యోగా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరమని, ప్రతి ఒక్కరూ దీనిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగ గురువు ఆచార్య బాలకృష్ణ అష్టాంగ యోగం యొక్క ప్రాముఖ్యతను వివరించగా, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని తెలిపారు. యోగా ఇన్స్ట్రక్టర్ ఝాన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, బి.ఎడ్. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అందరూ సంకల్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి