Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:13 AM

విశాల భారతి హైస్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

విశాల భారతి హైస్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

విశాల భారతి హైస్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
22-06-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* ఉత్సాహంగా ఆసనాలు వేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

చౌటుప్పల్ లోని విశాల భారతి హై స్కూల్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ఉత్సాహంగా సూర్య నమస్కారాలు, వివిధ యోగాసనాలను ప్రదర్శించారు.​పాఠశాల కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. యోగా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరమని, ప్రతి ఒక్కరూ దీనిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగ గురువు ఆచార్య బాలకృష్ణ అష్టాంగ యోగం యొక్క ప్రాముఖ్యతను వివరించగా, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని తెలిపారు. యోగా ఇన్‌స్ట్రక్టర్ ఝాన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, బి.ఎడ్. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అందరూ సంకల్పించారు.

Sthanikam

విశాల భారతి హైస్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Article Image

​* ఉత్సాహంగా ఆసనాలు వేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

చౌటుప్పల్ లోని విశాల భారతి హై స్కూల్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ఉత్సాహంగా సూర్య నమస్కారాలు, వివిధ యోగాసనాలను ప్రదర్శించారు.​పాఠశాల కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. యోగా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరమని, ప్రతి ఒక్కరూ దీనిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగ గురువు ఆచార్య బాలకృష్ణ అష్టాంగ యోగం యొక్క ప్రాముఖ్యతను వివరించగా, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని తెలిపారు. యోగా ఇన్‌స్ట్రక్టర్ ఝాన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, బి.ఎడ్. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అందరూ సంకల్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News