ధర్మాజీగూడెం పాల సంఘం చైర్మన్గా రాచకొండ కృష్ణయ్య
ధర్మాజీగూడెం పాల సంఘం చైర్మన్గా రాచకొండ కృష్ణయ్య
K.RAVI
రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక
పాల కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తా: కృష్ణయ్య
చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మాజీగూడెం గ్రామ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం నూతన పాలకవర్గ ఎన్నికలు నిర్వహించారు. సంఘం చైర్మన్గా రాచకొండ కృష్ణయ్య రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్లుగా కొంతం ఎల్లారెడ్డి, జక్కలి మల్లయ్య, ఊదరి యాదయ్యలు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చెరుకు మహేందర్ గౌడ్ ప్రకటించారు.ఈ సందర్భంగా నూతన చైర్మన్ రాచకొండ కృష్ణయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పాల సంఘం అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి తన వంతు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సామిడి అంజిరెడ్డి, సామిడి లింగారెడ్డి, జంగం రమేష్, జంగం అంజయ్య, ఊదరి ఎల్లయ్య, బద్రి బుచ్చయ్య, జక్కలి యాదయ్య, రాచకొండ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి