Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్లగొండలో ఘోరం: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు! పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 09:10 PM

ఫణిగిరి సమగ్రాభివృద్ధికి రూ.5 కోట్లు

ఫణిగిరి సమగ్రాభివృద్ధికి రూ.5 కోట్లు

ఫణిగిరి సమగ్రాభివృద్ధికి రూ.5 కోట్లు
June 22, 2026 07:46 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

ఫణిగిరి, గాజులబండ బౌద్ధ కట్టడాల పరిరక్షణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో ఫణిగిరి, గాజులబండ బౌద్ధ క్షేత్రాల పరిరక్షణ, పునరుద్ధరణ పనులకు సోమవారం పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మందుల సామేల్‌తో కలిసి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. తెలంగాణ జెన్‌కో (వైటీపీఎస్) సీఎస్‌ఆర్ నిధుల ద్వారా ఫణిగిరి బౌద్ధ కట్టడాల పరిరక్షణకు రూ.1.60 కోట్లు, గాజులబండ కట్టడాల సంరక్షణకు రూ.23 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.


కార్యక్రమానికి ముందు ఫణిగిరిలో పురావస్తు శాఖ తవ్వకాలలో లభించిన బౌద్ధ కళాఖండాలు, అవశేషాలను మంత్రి మ్యూజియంలో పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఫణిగిరి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బౌద్ధ వారసత్వ కేంద్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిందని పేర్కొన్నట్లు తెలిపారు. చారిత్రక, పురావస్తు సంపదను భావితరాలకు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, బౌద్ధ వారసత్వ కట్టడాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించినట్లు తెలిపారు.


ఫణిగిరి, గాజులబండ వంటి బౌద్ధ క్షేత్రాల అభివృద్ధి ద్వారా తెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక పటంలో మరింత గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నట్లు తెలిపారు. తవ్వకాలలో వెలుగులోకి వచ్చిన శిల్పాలు, శాసనాలు, నాణేలు తెలంగాణ చరిత్ర వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయని, పర్యాటకుల రాక పెరగడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని అభిప్రాయపడినట్లు తెలిపారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ప్రధాన రహదారి నుంచి ఫణిగిరి గుట్ట వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఫణిగిరి బౌద్ధ క్షేత్ర సమగ్ర అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినట్లు తెలిపారు.


ఈ నిధులతో ప్రధాన రహదారి నుంచి క్షేత్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం, కొండపైకి వెళ్లే మెట్లదారి, టాయిలెట్లు, పర్యాటక మౌలిక సదుపాయాలు, సందర్శకుల వసతుల మెరుగుదల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.


జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ ఫణిగిరి చరిత్ర జిల్లాకు గర్వకారణమని, అలాంటి చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సూర్యాపేట జిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఫణిగిరి బౌద్ధ క్షేత్రం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడినట్లు తెలిపారు.


కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. నరసింహ, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు, డిప్యూటీ డైరెక్టర్లు పగడం నాగరాజు, నర్సింగ్ నాయక్, ఓఎస్డీ రాజు, అసిస్టెంట్ డైరెక్టర్లు నాగలక్ష్మి, మల్లు నాయక్, ఫణిగిరి, గాజులబండ గ్రామాల సర్పంచులు ఎర్ర సావిత్రి, వంగూరు దామోదర్, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News