వార్తకు స్పందించిన అధికారులు.. భువనగిరి కేజీబీవీలో నీటి సమస్యకు పరిష్కారం
వార్తకు స్పందించిన అధికారులు.. భువనగిరి కేజీబీవీలో నీటి సమస్యకు పరిష్కారం
Editor Desk
భువనగిరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో నెలకొన్న నీటి కొరతపై ఇటీవల వెలువడిన వార్తలకు జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నెల 26న పలు పత్రికల్లో "భువనగిరి కేజీబీవీలో నీటి కొరత" అనే కథనం ప్రచురితమైన నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాఠశాలను సందర్శించి సమస్యలను పరిశీలించారు. వెంటనే మున్సిపల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాల ఆవరణలో చెడిపోయిన బోరును అత్యవసరంగా మరమ్మతులు చేయాలని ప్రత్యేక అధికారి చంద్రకళకు సూచించారు.
ఆదేశాల మేరకు ఆదివారం బోరు మరమ్మతు పనులు పూర్తి చేశారు. అలాగే హుస్సేనాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ మర్రి పాండు యాదవ్ చొరవతో మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్ రెడ్డి, కేజీబీవీ పాఠశాల–కళాశాలకు 24 గంటల నీటి సరఫరా అందేలా శాశ్వత కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు.
సమస్యను వేగంగా పరిష్కరించిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులకు కేజీబీవీ విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారంలో అధికారులు చూపిన చొరవ అభినందనీయమని వారు పేర్కొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి