Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:52 AM

వార్తకు స్పందించిన అధికారులు.. భువనగిరి కేజీబీవీలో నీటి సమస్యకు పరిష్కారం

వార్తకు స్పందించిన అధికారులు.. భువనగిరి కేజీబీవీలో నీటి సమస్యకు పరిష్కారం

వార్తకు స్పందించిన అధికారులు.. భువనగిరి కేజీబీవీలో నీటి సమస్యకు పరిష్కారం
28-06-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో నెలకొన్న నీటి కొరతపై ఇటీవల వెలువడిన వార్తలకు జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల 26న పలు పత్రికల్లో "భువనగిరి కేజీబీవీలో నీటి కొరత" అనే కథనం ప్రచురితమైన నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాఠశాలను సందర్శించి సమస్యలను పరిశీలించారు. వెంటనే మున్సిపల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాల ఆవరణలో చెడిపోయిన బోరును అత్యవసరంగా మరమ్మతులు చేయాలని ప్రత్యేక అధికారి చంద్రకళకు సూచించారు.

ఆదేశాల మేరకు ఆదివారం బోరు మరమ్మతు పనులు పూర్తి చేశారు. అలాగే హుస్సేనాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ మర్రి పాండు యాదవ్ చొరవతో మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్ రెడ్డి, కేజీబీవీ పాఠశాల–కళాశాలకు 24 గంటల నీటి సరఫరా అందేలా శాశ్వత కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు.

సమస్యను వేగంగా పరిష్కరించిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులకు కేజీబీవీ విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారంలో అధికారులు చూపిన చొరవ అభినందనీయమని వారు పేర్కొన్నారు

Sthanikam

వార్తకు స్పందించిన అధికారులు.. భువనగిరి కేజీబీవీలో నీటి సమస్యకు పరిష్కారం

Article Image

భువనగిరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో నెలకొన్న నీటి కొరతపై ఇటీవల వెలువడిన వార్తలకు జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల 26న పలు పత్రికల్లో "భువనగిరి కేజీబీవీలో నీటి కొరత" అనే కథనం ప్రచురితమైన నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాఠశాలను సందర్శించి సమస్యలను పరిశీలించారు. వెంటనే మున్సిపల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాల ఆవరణలో చెడిపోయిన బోరును అత్యవసరంగా మరమ్మతులు చేయాలని ప్రత్యేక అధికారి చంద్రకళకు సూచించారు.

ఆదేశాల మేరకు ఆదివారం బోరు మరమ్మతు పనులు పూర్తి చేశారు. అలాగే హుస్సేనాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ మర్రి పాండు యాదవ్ చొరవతో మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్ రెడ్డి, కేజీబీవీ పాఠశాల–కళాశాలకు 24 గంటల నీటి సరఫరా అందేలా శాశ్వత కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు.

సమస్యను వేగంగా పరిష్కరించిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులకు కేజీబీవీ విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారంలో అధికారులు చూపిన చొరవ అభినందనీయమని వారు పేర్కొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News