Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండ్రాంపల్లి కాల్వలో గుర్తుతెలియని మృతదేహం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 28, 2026 07:06 PM

వార్తకు స్పందించిన అధికారులు.. భువనగిరి కేజీబీవీలో నీటి సమస్యకు పరిష్కారం

వార్తకు స్పందించిన అధికారులు.. భువనగిరి కేజీబీవీలో నీటి సమస్యకు పరిష్కారం

వార్తకు స్పందించిన అధికారులు.. భువనగిరి కేజీబీవీలో నీటి సమస్యకు పరిష్కారం
June 28, 2026 04:03 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో నెలకొన్న నీటి కొరతపై ఇటీవల వెలువడిన వార్తలకు జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల 26న పలు పత్రికల్లో "భువనగిరి కేజీబీవీలో నీటి కొరత" అనే కథనం ప్రచురితమైన నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాఠశాలను సందర్శించి సమస్యలను పరిశీలించారు. వెంటనే మున్సిపల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాల ఆవరణలో చెడిపోయిన బోరును అత్యవసరంగా మరమ్మతులు చేయాలని ప్రత్యేక అధికారి చంద్రకళకు సూచించారు.

ఆదేశాల మేరకు ఆదివారం బోరు మరమ్మతు పనులు పూర్తి చేశారు. అలాగే హుస్సేనాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ మర్రి పాండు యాదవ్ చొరవతో మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్ రెడ్డి, కేజీబీవీ పాఠశాల–కళాశాలకు 24 గంటల నీటి సరఫరా అందేలా శాశ్వత కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు.

సమస్యను వేగంగా పరిష్కరించిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులకు కేజీబీవీ విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారంలో అధికారులు చూపిన చొరవ అభినందనీయమని వారు పేర్కొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News