Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:52 AM

రామన్నపేటలో పల్స్ పోలియోకు విశేష స్పందన. 94% లక్ష్యం పూర్తి.. 3,014 మంది చిన్నారులకు పోలియో చుక్కలు.

రామన్నపేటలో పల్స్ పోలియోకు విశేష స్పందన. 94% లక్ష్యం పూర్తి.. 3,014 మంది చిన్నారులకు పోలియో చుక్కలు.

రామన్నపేటలో పల్స్ పోలియోకు విశేష స్పందన.  94% లక్ష్యం పూర్తి.. 3,014 మంది చిన్నారులకు పోలియో చుక్కలు.
28-06-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా సాగింది. మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లలో 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రామన్నపేట ప్రధాన బూత్‌ను సర్పంచ్ గారికే సత్యనారాయణ ప్రారంభించగా, ఇతర గ్రామాల్లో ఆయా సర్పంచులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మండలానికి నిర్దేశించిన 3,217 మంది చిన్నారుల లక్ష్యంలో, తొలి రోజే 3,014 మందికి పోలియో చుక్కలు వేసి 94 శాతం కవరేజ్ సాధించినట్లు మండల వైద్యాధికారి డా. అశ్విని కుమార్ తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకోని మిగిలిన చిన్నారులకు సోమవారం, మంగళవారం ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని, ఒక్క చిన్నారి కూడా మిగలకుండా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

రామన్నపేటలో పల్స్ పోలియోకు విశేష స్పందన. 94% లక్ష్యం పూర్తి.. 3,014 మంది చిన్నారులకు పోలియో చుక్కలు.

Article Image

రామన్నపేట మండలంలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా సాగింది. మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లలో 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రామన్నపేట ప్రధాన బూత్‌ను సర్పంచ్ గారికే సత్యనారాయణ ప్రారంభించగా, ఇతర గ్రామాల్లో ఆయా సర్పంచులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మండలానికి నిర్దేశించిన 3,217 మంది చిన్నారుల లక్ష్యంలో, తొలి రోజే 3,014 మందికి పోలియో చుక్కలు వేసి 94 శాతం కవరేజ్ సాధించినట్లు మండల వైద్యాధికారి డా. అశ్విని కుమార్ తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకోని మిగిలిన చిన్నారులకు సోమవారం, మంగళవారం ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని, ఒక్క చిన్నారి కూడా మిగలకుండా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News