రామన్నపేటలో పల్స్ పోలియోకు విశేష స్పందన. 94% లక్ష్యం పూర్తి.. 3,014 మంది చిన్నారులకు పోలియో చుక్కలు.
రామన్నపేటలో పల్స్ పోలియోకు విశేష స్పందన. 94% లక్ష్యం పూర్తి.. 3,014 మంది చిన్నారులకు పోలియో చుక్కలు.
Editor Desk
రామన్నపేట మండలంలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా సాగింది. మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్లలో 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రామన్నపేట ప్రధాన బూత్ను సర్పంచ్ గారికే సత్యనారాయణ ప్రారంభించగా, ఇతర గ్రామాల్లో ఆయా సర్పంచులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మండలానికి నిర్దేశించిన 3,217 మంది చిన్నారుల లక్ష్యంలో, తొలి రోజే 3,014 మందికి పోలియో చుక్కలు వేసి 94 శాతం కవరేజ్ సాధించినట్లు మండల వైద్యాధికారి డా. అశ్విని కుమార్ తెలిపారు.
వ్యాక్సిన్ తీసుకోని మిగిలిన చిన్నారులకు సోమవారం, మంగళవారం ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని, ఒక్క చిన్నారి కూడా మిగలకుండా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి