సీఎం పర్యటన వేళ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నేతల ముందస్తు అరెస్టులు
సీఎం పర్యటన వేళ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నేతల ముందస్తు అరెస్టులు
Komidala Mahender reddy
ప్రజాస్వామ్య హక్కులపై ఆంక్షలంటూ ఆందోళన.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్
చిట్యాల,
నల్లగొండ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్, డీవైఎఫ్ఐ చిట్యాల మండల అధ్యక్షుడు పందు నరేష్తో పాటు డీవైఎఫ్ఐ నాయకులు గోలి సాయికిరణ్, ఆరూరి నరసింహలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిరసనలు లేదా వినతిపత్రాల సమర్పణకు అవకాశం లేకుండా చేయడానికే ఈ అరెస్టులు జరిగాయని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అలాంటి హక్కులను హరించే విధంగా ముందస్తు అరెస్టులు చేయడం తగదని పేర్కొన్నారు.నాయకులను ఎలాంటి నేరం లేకుండా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, వెంటనే వారిని విడుదల చేయాలని విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ఘటనపై పోలీసులు మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సమాచారం. కాగా, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి