Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:19 AM

సీఎం పర్యటన వేళ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నేతల ముందస్తు అరెస్టులు

సీఎం పర్యటన వేళ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నేతల ముందస్తు అరెస్టులు

సీఎం పర్యటన వేళ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నేతల ముందస్తు అరెస్టులు
28-06-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ప్రజాస్వామ్య హక్కులపై ఆంక్షలంటూ ఆందోళన.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్

చిట్యాల,

నల్లగొండ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్, డీవైఎఫ్‌ఐ చిట్యాల మండల అధ్యక్షుడు పందు నరేష్‌తో పాటు డీవైఎఫ్‌ఐ నాయకులు గోలి సాయికిరణ్, ఆరూరి నరసింహలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిరసనలు లేదా వినతిపత్రాల సమర్పణకు అవకాశం లేకుండా చేయడానికే ఈ అరెస్టులు జరిగాయని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అలాంటి హక్కులను హరించే విధంగా ముందస్తు అరెస్టులు చేయడం తగదని పేర్కొన్నారు.నాయకులను ఎలాంటి నేరం లేకుండా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, వెంటనే వారిని విడుదల చేయాలని విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ఘటనపై పోలీసులు మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సమాచారం. కాగా, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

సీఎం పర్యటన వేళ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నేతల ముందస్తు అరెస్టులు

Article Image

ప్రజాస్వామ్య హక్కులపై ఆంక్షలంటూ ఆందోళన.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్

చిట్యాల,

నల్లగొండ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్, డీవైఎఫ్‌ఐ చిట్యాల మండల అధ్యక్షుడు పందు నరేష్‌తో పాటు డీవైఎఫ్‌ఐ నాయకులు గోలి సాయికిరణ్, ఆరూరి నరసింహలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిరసనలు లేదా వినతిపత్రాల సమర్పణకు అవకాశం లేకుండా చేయడానికే ఈ అరెస్టులు జరిగాయని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అలాంటి హక్కులను హరించే విధంగా ముందస్తు అరెస్టులు చేయడం తగదని పేర్కొన్నారు.నాయకులను ఎలాంటి నేరం లేకుండా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, వెంటనే వారిని విడుదల చేయాలని విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ఘటనపై పోలీసులు మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సమాచారం. కాగా, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News