భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్గా డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డికి జాతీయ అవార్డు
భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్గా డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డికి జాతీయ అవార్డు
K.RAVI
ప్రైడ్ ఆఫ్ హెల్త్కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026లో అరుదైన గౌరవం
నటి జయప్రద చేతుల మీదుగా సత్కారం
ప్రముఖ సంతానోత్పత్తి నిపుణురాలు డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డి వైద్య రంగంలో మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. “ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్ ఆఫ్ ది ఇయర్ – 2026” అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.హైదరాబాద్ లోని ది పార్క్ హైదరాబాద్ లో నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ హెల్త్కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్, సమ్మిట్–2026 కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేశారు. సినీ నటి, మాజీ రాజ్యసభ సభ్యురాలు జయ ప్రద ముఖ్య అతిథిగా హాజరై విజేతలను సత్కరించారు.సంతానలేమితో బాధపడుతున్న వేలాది దంపతులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ, నమ్మకమైన చికిత్సతో ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్న డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డి సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ గౌరవం దక్కడం పట్ల వైద్య వర్గాలు, సహచర వైద్యులు, రోగులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ అవార్డు ఆమె వైద్య సేవలకు లభించిన మరో విశిష్ట గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి