దళితవాడల సమస్యలపై క్షేత్రస్థాయి సర్వే. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతులు.
దళితవాడల సమస్యలపై క్షేత్రస్థాయి సర్వే. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతులు.
Editor Desk
రామన్నపేట మండలం లోని కక్కిరేణి గ్రామంలోని దళితవాడల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. జీవన పరిస్థితులు, సామాజిక వివక్ష, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు మేడి ముకుందం, మండల కార్యదర్శి కందుల హనుమంతు మాట్లాడుతూ.. ఎస్సీ కాలనీల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రజల భద్రత కోసం ఎస్సీ కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కమ్యూనిటీ హాలుకు ప్రహరీ గోడ నిర్మించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. భూమిలేని పేద కుటుంబాలకు నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
దళితవాడల్లోని సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించి సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం మండల ఉపాధ్యక్షుడు వేముల సైదులు, అనిత, నరేష్, నీరజ, దేవేందర్, ముత్తమ్మ, మాతమ్మ, నరసింహ, కవిత తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి