ఉద్యోగాలు అడిగితే అరెస్టులా?.. డివైఎఫ్ఐ ఆగ్రహం
ఉద్యోగాలు అడిగితే అరెస్టులా?.. డివైఎఫ్ఐ ఆగ్రహం
Editor Desk
: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన సందర్భంగా డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్తో పాటు జిల్లా వ్యాప్తంగా పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు డివైఎఫ్ఐ నాయకులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తున్న నాయకులను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
నిరుద్యోగ యువత తరఫున ఉద్యోగాల కోసం ప్రశ్నించడం నేరం కాదని, పోరాటం చేస్తున్న యువజన నాయకులను అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించే గొంతులను అణిచివేసే చర్యలకు పాల్పడడం సరికాదన్నారు.
రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నందున వాటిని వెంటనే భర్తీ చేయాలని, ఎన్నికల హామీలను అమలు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. అలాగే అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, ఇటువంటి అక్రమ నిర్బంధాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి