Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:17 AM

పల్స్ పోలియో ప్రతి బిడ్డకు రక్షణ కవచం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

పల్స్ పోలియో ప్రతి బిడ్డకు రక్షణ కవచం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

పల్స్ పోలియో ప్రతి బిడ్డకు రక్షణ కవచం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్
28-06-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. స్థానిక బస్టాండ్ ఆవరణతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి, చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ... ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకోవడానికి ఈ చుక్కలు రక్షణ కవచంలా పనిచేస్తాయని పేర్కొన్నారు. పట్టణంలో ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేసుకోకుండా ఉండిపోకూడదని, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పాక చిరంజీవి, చింతల ఉమామహేశ్వరి సాయిలు, ఎండి హను బాయ్, బత్తుల జయమ్మ దాస్, ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్ సుమన్ కళ్యాణ్, కాటమరాజు, పాండురంగారావు, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

పల్స్ పోలియో ప్రతి బిడ్డకు రక్షణ కవచం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

Article Image

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. స్థానిక బస్టాండ్ ఆవరణతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి, చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ... ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకోవడానికి ఈ చుక్కలు రక్షణ కవచంలా పనిచేస్తాయని పేర్కొన్నారు. పట్టణంలో ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేసుకోకుండా ఉండిపోకూడదని, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పాక చిరంజీవి, చింతల ఉమామహేశ్వరి సాయిలు, ఎండి హను బాయ్, బత్తుల జయమ్మ దాస్, ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్ సుమన్ కళ్యాణ్, కాటమరాజు, పాండురంగారావు, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News