పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్
పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్
K.RAVI
చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమం ప్రారంభం
పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని నేలపట్ల గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం నేలపట్ల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అనంతరం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో మహమ్మారిని దేశం నుండి తరిమికొట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని గ్రామంలో వంద శాతం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండు మల్లయ్య గౌడ్, టీడీపి పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు తడక కోటేశ్వర్, చౌట సంపత్ కుమార్, స్థానిక వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి