Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 AM

పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్

పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్

పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్
28-06-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమం ప్రారంభం

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని నేలపట్ల గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం నేలపట్ల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అనంతరం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో మహమ్మారిని దేశం నుండి తరిమికొట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని గ్రామంలో వంద శాతం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండు మల్లయ్య గౌడ్, టీడీపి పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు తడక కోటేశ్వర్, చౌట సంపత్ కుమార్, స్థానిక వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్

Article Image

చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమం ప్రారంభం

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని నేలపట్ల గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం నేలపట్ల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అనంతరం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో మహమ్మారిని దేశం నుండి తరిమికొట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని గ్రామంలో వంద శాతం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండు మల్లయ్య గౌడ్, టీడీపి పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు తడక కోటేశ్వర్, చౌట సంపత్ కుమార్, స్థానిక వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News