రామన్నపేటలో సౌర విప్లవానికి శ్రీకారం. పీఎం కుసుమ్తో రైతులకు సౌరశక్తి వరం.
రామన్నపేటలో సౌర విప్లవానికి శ్రీకారం. పీఎం కుసుమ్తో రైతులకు సౌరశక్తి వరం.
Editor Desk
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో పీఎం కుసుమ్ పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్ను ఆదివారం ట్రాన్స్కో ఎస్ఈ సురేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్లింకో ఎనర్జీ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మనోడి మాట్లాడుతూ, సౌర విద్యుత్ ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తెలంగాణలో తొలి సౌర విద్యుత్ ప్లాంట్ను రామన్నపేటలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
రాబోయే రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 10 నుంచి 15 సౌర విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈపీసీ భాగస్వామ్యంతో స్లింకో ఎనర్జీ ఇంజినీరింగ్ సంస్థ పూర్తి స్థాయి సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టులను అమలు చేసిందని తెలిపారు.
ఈ సందర్భంగా ప్లాంట్ యజమానులు జీవన్రెడ్డి, పద్మారావును అధికారులు అభినందించారు.
కార్యక్రమంలో చౌటుప్పల్ డీఈ మల్లికార్జున్, ఎంఆర్టీ డీఈ విజయభాస్కర్, ఏడీఈ శ్రీకాంత్, ఏఈ కోటేశ్వరరావు, సబ్స్టేషన్ సిబ్బంది, ప్రాజెక్ట్ డెవలపర్లు, స్లింకో ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి