యాదాద్రి భువనగిరి పట్టణంలోని విద్యానగర్ వార్డులో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ నాకోటి నగేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని అన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ప్రజలు చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి