Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:46 AM

రామన్నపేట పాల సంఘం చైర్మన్‌గా గోరిగే శేఖర్

రామన్నపేట పాల సంఘం చైర్మన్‌గా గోరిగే శేఖర్

రామన్నపేట పాల సంఘం చైర్మన్‌గా గోరిగే శేఖర్
28-06-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన పాలకవర్గ ఎన్నికలు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో ముగిశాయి. రామన్నపేట పాల సంఘం నూతన చైర్మన్‌గా గోరిగే శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ సభ్యులందరి పూర్తి మద్దతుతో ఆయనను చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల స్థానిక పాడి రైతులు,ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఎన్నికల్లో చైర్మన్‌తో పాటు నూతన డైరెక్టర్‌గా కడగంచి పరమేశ్ ఎన్నిక కాగా, డైరెక్టర్లుగా కడగంచి ఐలయ్య, మిరియాల శంకరయ్య,చిందం రమేష్,బండ కుమార్,బండ లింగస్వామి,మోటే మల్లికార్జున్, మోటే వెంకటేశ్వర్లు,కడగంచి ఈశ్వర్ ఎన్నికయ్యారు.రామన్నపేట పాల సంఘం అభివృద్ధికి,పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా తమ నూతన పాలకవర్గం పనిచేస్తుందని నూతన చైర్మన్ గొరిగే శేఖర్ తెలిపారు.తనపై నమ్మకంతో చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి గ్రామ ప్రముఖులు,పాడి రైతులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో రామన్నపేట పాల సంఘం మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

రామన్నపేట పాల సంఘం చైర్మన్‌గా గోరిగే శేఖర్

Article Image

రామన్నపేట

పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన పాలకవర్గ ఎన్నికలు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో ముగిశాయి. రామన్నపేట పాల సంఘం నూతన చైర్మన్‌గా గోరిగే శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ సభ్యులందరి పూర్తి మద్దతుతో ఆయనను చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల స్థానిక పాడి రైతులు,ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఎన్నికల్లో చైర్మన్‌తో పాటు నూతన డైరెక్టర్‌గా కడగంచి పరమేశ్ ఎన్నిక కాగా, డైరెక్టర్లుగా కడగంచి ఐలయ్య, మిరియాల శంకరయ్య,చిందం రమేష్,బండ కుమార్,బండ లింగస్వామి,మోటే మల్లికార్జున్, మోటే వెంకటేశ్వర్లు,కడగంచి ఈశ్వర్ ఎన్నికయ్యారు.రామన్నపేట పాల సంఘం అభివృద్ధికి,పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా తమ నూతన పాలకవర్గం పనిచేస్తుందని నూతన చైర్మన్ గొరిగే శేఖర్ తెలిపారు.తనపై నమ్మకంతో చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి గ్రామ ప్రముఖులు,పాడి రైతులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో రామన్నపేట పాల సంఘం మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News