రామన్నపేట పాల సంఘం చైర్మన్గా గోరిగే శేఖర్
రామన్నపేట పాల సంఘం చైర్మన్గా గోరిగే శేఖర్
Editor Desk
రామన్నపేట
పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన పాలకవర్గ ఎన్నికలు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో ముగిశాయి. రామన్నపేట పాల సంఘం నూతన చైర్మన్గా గోరిగే శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ సభ్యులందరి పూర్తి మద్దతుతో ఆయనను చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల స్థానిక పాడి రైతులు,ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఎన్నికల్లో చైర్మన్తో పాటు నూతన డైరెక్టర్గా కడగంచి పరమేశ్ ఎన్నిక కాగా, డైరెక్టర్లుగా కడగంచి ఐలయ్య, మిరియాల శంకరయ్య,చిందం రమేష్,బండ కుమార్,బండ లింగస్వామి,మోటే మల్లికార్జున్, మోటే వెంకటేశ్వర్లు,కడగంచి ఈశ్వర్ ఎన్నికయ్యారు.రామన్నపేట పాల సంఘం అభివృద్ధికి,పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా తమ నూతన పాలకవర్గం పనిచేస్తుందని నూతన చైర్మన్ గొరిగే శేఖర్ తెలిపారు.తనపై నమ్మకంతో చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి గ్రామ ప్రముఖులు,పాడి రైతులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో రామన్నపేట పాల సంఘం మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి