ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఇంటింటి ప్రచారం
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఇంటింటి ప్రచారం
Biksham
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని 17వ వార్డులో భారత రాష్ట్ర సమితి నాయకులు సోమవారం ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించారు.
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సూచనల మేరకు పార్టీ నాయకుడు కీసర వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు గడపగడపకు వెళ్లి ఓటర్లను కలిసి వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను ధృవీకరించుకుని జాబితాలో పేరు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కీసర వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించాలని కోరారు. ప్రజలు చురుకుగా పాల్గొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. వార్డులో ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా ఇంటింటి పరిశీలన కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకుడు నరేడ్ల మల్లయ్య నాయుడు, స్థానిక నాయకులు ఆదిమళ్ల వేణు, మొగిలి మధు, వావిలాల ప్రభాకర్, బిట్టు శివ, వడ్డేపల్లి మహేష్, బొజ్జ నవీన్, మొగిలి వంశీ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి