Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:09 AM

ఖుషి వైన్స్ ఎదుట కరెంటు వైర్లు తెగిపడి కలకలం

ఖుషి వైన్స్ ఎదుట కరెంటు వైర్లు తెగిపడి కలకలం

ఖుషి వైన్స్ ఎదుట కరెంటు వైర్లు తెగిపడి కలకలం
06-07-2026 177 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


బైకులపై పడిన విద్యుత్ తీగలు.. తృటిలో తప్పిన ప్రమాదం

అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆందోళన.


చిట్యాల,

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఖుషి వైన్స్ ముందు విద్యుత్ వైర్లు తెగిపడి బైకులపై పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటన సమయంలో బైకులను అక్కడ పార్క్ చేసి యజమానులు వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్డులో అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తెగిపడి అక్కడ నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలపై పడటంతో కొంతసేపు భయాందోళన నెలకొంది. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో ఎవరూ వాహనాల వద్ద లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. లేదంటే తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉండేదని స్థానికులు పేర్కొన్నారు.

విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి తెగిపోయిన వైర్లను తొలగించి, ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

స్థానికులు పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే సంబంధిత శాఖలు అప్రమత్తమై తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Sthanikam

ఖుషి వైన్స్ ఎదుట కరెంటు వైర్లు తెగిపడి కలకలం

Article Image


బైకులపై పడిన విద్యుత్ తీగలు.. తృటిలో తప్పిన ప్రమాదం

అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆందోళన.


చిట్యాల,

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఖుషి వైన్స్ ముందు విద్యుత్ వైర్లు తెగిపడి బైకులపై పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటన సమయంలో బైకులను అక్కడ పార్క్ చేసి యజమానులు వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్డులో అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తెగిపడి అక్కడ నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలపై పడటంతో కొంతసేపు భయాందోళన నెలకొంది. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో ఎవరూ వాహనాల వద్ద లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. లేదంటే తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉండేదని స్థానికులు పేర్కొన్నారు.

విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి తెగిపోయిన వైర్లను తొలగించి, ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

స్థానికులు పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే సంబంధిత శాఖలు అప్రమత్తమై తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News