ఖుషి వైన్స్ ఎదుట కరెంటు వైర్లు తెగిపడి కలకలం
ఖుషి వైన్స్ ఎదుట కరెంటు వైర్లు తెగిపడి కలకలం
Komidala Mahender reddy
బైకులపై పడిన విద్యుత్ తీగలు.. తృటిలో తప్పిన ప్రమాదం
అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆందోళన.
చిట్యాల,
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఖుషి వైన్స్ ముందు విద్యుత్ వైర్లు తెగిపడి బైకులపై పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటన సమయంలో బైకులను అక్కడ పార్క్ చేసి యజమానులు వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్డులో అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తెగిపడి అక్కడ నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలపై పడటంతో కొంతసేపు భయాందోళన నెలకొంది. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో ఎవరూ వాహనాల వద్ద లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. లేదంటే తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉండేదని స్థానికులు పేర్కొన్నారు.
విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి తెగిపోయిన వైర్లను తొలగించి, ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
స్థానికులు పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే సంబంధిత శాఖలు అప్రమత్తమై తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి