బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి ఆధార్ పార్టీ; పార్టీ వ్యవస్థాపకులు ఈడ శేషగిరి రావు గౌడ్
బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి ఆధార్ పార్టీ; పార్టీ వ్యవస్థాపకులు ఈడ శేషగిరి రావు గౌడ్
Bandi Kiran Kumar
తుంగతుర్తి;బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి ఆధార్ పార్టీ స్థాపించామని పార్టీ వ్యవస్థాపకులుఈడ శేషగిరి రావు గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి షేక్ జానీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని నియోజకవర్గా ఇంచార్జ్ రా సమావేశంలో పాల్గొని మాట్లాడారూ. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నియమించామని రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాలో, ఏ పార్టీ కిపోత్తు లేకుండా ఒంటరిగా పార్టీ పోటీ చేస్తుందని రానున్న ఎంపీటీసీ, జడ్పిటిసి, కార్పొరేషన్,ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఒంటరిగానే పోటీ చేస్తుందని,బీసీ రిజర్వేషన్ల కోసం పార్టీని స్థాపించడం జరిగిందన్నారు.అలాగే ఎస్సీ,ఎస్టి,బీసీ,మైనార్టీ లోని బడుగు బలహీన వర్గాలకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల స్థాయిలో ఆధార్ పార్టీని పోటీ చేసే దిశలో పార్టీని ముందుకు తీసుకెళుతున్నామని చపాతి రోలర్ మా పార్టీ గుర్తు అని అన్నారు.మొన్న కేజ్రీవాల్ నేడు తమిళనాడులోని విజయ్ తరహాలో తెలంగాణలో కూడా ఆధార్ పార్టీ తప్పకుండా వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబోజీ బుడ్డయ్య,రాష్ట్ర ఎస్టీ సెల్ చైర్మన్ అలెం వెంకటేశ్వర్లు,నల్గొండ జిల్లా అధ్యక్షులు పోట్టబత్తుల సైదులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కంటి కేశవ ,కొత్తగూడెం ఇంచార్జ్ ప్రేమ్ ,కోదాడ ఇంచార్జ్ సైదులు,జనగామ జిల్లా అధ్యక్షులు వేముల రమేష్,ఖమ్మం జిల్లా అధ్యక్షులు కుక్కల నాగేశ్వరరావు గౌడ్,భువనగిరి ఇంచార్జ్ మధుమిత,నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీనివాస్,ఆధార్ పార్టీ నాయకులు
తల్లాడ వెంకన్న,మంద హరినాథ్ బాబు,డి.ఆర్ తోడేటి దుర్గాప్రసాద్ గౌడ్,పాండురంగాపురం అధ్యక్షులు కొప్పుల సునీల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి