రామన్నపేట, జూలై 5: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి మరో అడుగు పడింది. గ్రామంలోని 4వ వార్డులో మాధవరెడ్డి విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన మంచినీటి బోరు మోటర్ను సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే గ్రామ పంచాయతీ లక్ష్యమన్నారు. ప్రతి వార్డులో తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
కార్యక్రమంలో 4వ వార్డు సభ్యుడు సండ్ల లింగయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి