Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:33 AM

దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణకు శాశ్వత స్ఫూర్తి – ఎమ్మెల్యే చింత ప్రభాకర్

దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణకు శాశ్వత స్ఫూర్తి – ఎమ్మెల్యే చింత ప్రభాకర్

దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణకు శాశ్వత స్ఫూర్తి – ఎమ్మెల్యే చింత ప్రభాకర్
04-07-2026 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని సండే మార్కెట్ వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం, పోరాటం చిరస్మరణీయమని అన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం ఆయన ప్రాణత్యాగం చేసి తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేశారని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, డాక్టర్ శ్రీహరి, పుష్ప నాగేష్, లాడే మల్లేశం, లాడే బాలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణకు శాశ్వత స్ఫూర్తి – ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Article Image

దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని సండే మార్కెట్ వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం, పోరాటం చిరస్మరణీయమని అన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం ఆయన ప్రాణత్యాగం చేసి తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేశారని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, డాక్టర్ శ్రీహరి, పుష్ప నాగేష్, లాడే మల్లేశం, లాడే బాలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News