దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణకు శాశ్వత స్ఫూర్తి – ఎమ్మెల్యే చింత ప్రభాకర్
దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణకు శాశ్వత స్ఫూర్తి – ఎమ్మెల్యే చింత ప్రభాకర్
Krishna
దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని సండే మార్కెట్ వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం, పోరాటం చిరస్మరణీయమని అన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం ఆయన ప్రాణత్యాగం చేసి తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేశారని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, డాక్టర్ శ్రీహరి, పుష్ప నాగేష్, లాడే మల్లేశం, లాడే బాలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి