Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:03 AM

వైభవంగా శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

వైభవంగా శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

వైభవంగా శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
04-07-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ భూదేవి–లీలాదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు శనివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఉత్సవాల్లో భాగంగా జెల్లా రజని–వెంకటేష్ దంపతులు స్వామివారి మూలవిరాట్టుకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన హోమ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గరిక రాధిక–సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటే రమేష్, ఆలయ చైర్మన్ ఉపేందర్–జానకి, కొంపల్లి సుమలత–సురేష్, సిందం లక్ష్మీబాయి–లింగయ్య, రాపోలు రాజశేఖర్, మిరియాల కవిత–వెంకటయ్య, మిరియాల జయమ్మ–రమేష్, చంద్రగిరి పుష్ప–నరసింహ, బొడ్డు శంకరయ్య, జింకల నరసింహ, దొంత యాదగిరి, అలిసేరు వంశీ, జ్యోతి, ఇంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపారు.

Sthanikam

వైభవంగా శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

Article Image

రామన్నపేట,

పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ భూదేవి–లీలాదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు శనివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఉత్సవాల్లో భాగంగా జెల్లా రజని–వెంకటేష్ దంపతులు స్వామివారి మూలవిరాట్టుకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన హోమ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గరిక రాధిక–సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటే రమేష్, ఆలయ చైర్మన్ ఉపేందర్–జానకి, కొంపల్లి సుమలత–సురేష్, సిందం లక్ష్మీబాయి–లింగయ్య, రాపోలు రాజశేఖర్, మిరియాల కవిత–వెంకటయ్య, మిరియాల జయమ్మ–రమేష్, చంద్రగిరి పుష్ప–నరసింహ, బొడ్డు శంకరయ్య, జింకల నరసింహ, దొంత యాదగిరి, అలిసేరు వంశీ, జ్యోతి, ఇంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News