నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం లక్ష్మపురం గ్రామంలో నిర్వహిస్తున్న గంగమ్మ దేవి జాతరకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జాతర విజయవంతంగా నిర్వహించబడాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి