విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించుకోవాలి: జడ్జి ఎం. హిమబిందు
విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించుకోవాలి: జడ్జి ఎం. హిమబిందు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని జుక్కల్ శివారులో ఉన్న టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ విద్యాసంస్థలో శనివారం న్యాయ అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం. హిమబిందు మాట్లాడుతూ, విద్యార్థులు తమ హక్కులతో పాటు విధుల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరమని అన్నారు.సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు.అలాగే బాలల రక్షణ చట్టాలు, మహిళల భద్రత, విద్యార్థుల హక్కులు, న్యాయ సహాయం పొందే మార్గాలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.చట్టాలపై అవగాహన ఉండటం వల్ల నేరాలకు దూరంగా ఉండటంతో పాటు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగవచ్చని తెలిపారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవరుచుకుని మంచి పౌరులుగా ఎదగాలని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి