Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించుకోవాలి: జడ్జి ఎం. హిమబిందు

విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించుకోవాలి: జడ్జి ఎం. హిమబిందు

విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించుకోవాలి: జడ్జి ఎం. హిమబిందు
04-07-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని జుక్కల్ శివారులో ఉన్న టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ విద్యాసంస్థలో శనివారం న్యాయ అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం. హిమబిందు మాట్లాడుతూ, విద్యార్థులు తమ హక్కులతో పాటు విధుల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరమని అన్నారు.సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు.అలాగే బాలల రక్షణ చట్టాలు, మహిళల భద్రత, విద్యార్థుల హక్కులు, న్యాయ సహాయం పొందే మార్గాలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.చట్టాలపై అవగాహన ఉండటం వల్ల నేరాలకు దూరంగా ఉండటంతో పాటు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగవచ్చని తెలిపారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవరుచుకుని మంచి పౌరులుగా ఎదగాలని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించుకోవాలి: జడ్జి ఎం. హిమబిందు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని జుక్కల్ శివారులో ఉన్న టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ విద్యాసంస్థలో శనివారం న్యాయ అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం. హిమబిందు మాట్లాడుతూ, విద్యార్థులు తమ హక్కులతో పాటు విధుల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరమని అన్నారు.సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు.అలాగే బాలల రక్షణ చట్టాలు, మహిళల భద్రత, విద్యార్థుల హక్కులు, న్యాయ సహాయం పొందే మార్గాలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.చట్టాలపై అవగాహన ఉండటం వల్ల నేరాలకు దూరంగా ఉండటంతో పాటు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగవచ్చని తెలిపారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవరుచుకుని మంచి పౌరులుగా ఎదగాలని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News