రైతులకు ఉచితంగా పత్తి విత్తనాల పంపిణీ
రైతులకు ఉచితంగా పత్తి విత్తనాల పంపిణీ
K.RAVI
* తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించాలి
* ఆధునిక సాగు పద్ధతులపై వ్యవసాయ అధికారుల అవగాహన
జాతీయ పత్తి ఉత్పాదకత మిషన్లో భాగంగా చౌటుప్పల్ రైతు వేదికలో శనివారం రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు మాట్లాడుతూ.. రైతులు పత్తిని దగ్గర పంట (90 \times 30 సెం.మీ) లేదా ఐసీఎం (90 \times 60 సెం.మీ) పద్ధతిలో విత్తుకోవాలని సూచించారు. మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగకుండా ఉండటానికి 'మెపి క్వాట్ క్లోరైడ్' పిచికారీ చేయాలన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యలు మాట్లాడుతూ.. రైతులు అధికారుల సాంకేతిక సలహాలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలన్నారు. ప్రస్తుత వర్షభావ పరిస్థితుల దృష్ట్యా జూలై 15 లోపు సబ్సిడీపై ఆరుతడి పంటల విత్తనాలను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి