PRINT TIME: July 04, 2026 09:23 PM
వాహనాల యజమానులకు చివరి అవకాశం.. తర్వాత బహిరంగ వేలమే
వాహనాల యజమానులకు చివరి అవకాశం.. తర్వాత బహిరంగ వేలమే
July 04, 2026 07:43 PM
49 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకుని, యజమానులను గుర్తించలేకపోయిన 354 వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు జిల్లా పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ తెలిపారు. ఈ వాహనాలపై యాజమాన్య హక్కు ఉన్నవారు లేదా అభ్యంతరాలు ఉన్నవారు 02-07-2026 నుంచి ఆరు నెలల్లోపు సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులో ఎలాంటి క్లెయిమ్లు రాకపోతే నిబంధనల ప్రకారం వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తామని తెలిపారు. వాహనాల వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయం, సంబంధిత పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండగా, మరిన్ని వివరాలకు అదనపు ఎస్పీ కార్యాలయం లేదా రిజర్వ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి (సెల్: 8712656743)ను సంప్రదించాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి