Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండ్రంపల్లి పాల సంఘం అధ్యక్షురాలిగా శైలజ మహేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 03:02 PM

నారాయణ స్కూల్‌లో పుస్తకాల దోపిడీపై డీవైఎఫ్‌ఐ ఆందోళన అధిక ధరలకు పుస్తకాల విక్రయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

నారాయణ స్కూల్‌లో పుస్తకాల దోపిడీపై డీవైఎఫ్‌ఐ ఆందోళన అధిక ధరలకు పుస్తకాల విక్రయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

నారాయణ స్కూల్‌లో పుస్తకాల దోపిడీపై డీవైఎఫ్‌ఐ ఆందోళన అధిక ధరలకు పుస్తకాల విక్రయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
June 30, 2026 01:18 PM 170 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్, జూన్ 30:

నకిరేకల్‌లోని నారాయణ స్కూల్‌లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ డీవైఎఫ్‌ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతూ పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తోందని వారు విమర్శించారు.ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ, విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను దోచుకోవడం సరికాదని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంల పేరుతో విద్యార్థుల కుటుంబాలపై అదనపు భారం మోపడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పాఠశాలలో జరుగుతున్న పుస్తకాల విక్రయాలపై విచారణ నిర్వహించి, అధిక ధరల వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్, కార్యదర్శి ముసుకు రవీందర్, డీవైఎఫ్‌ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్, నాయకులు బొడ్డుపల్లి నరేష్, శశికుమార్, శివప్రసాద్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News