నారాయణ స్కూల్లో పుస్తకాల దోపిడీపై డీవైఎఫ్ఐ ఆందోళన అధిక ధరలకు పుస్తకాల విక్రయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
నారాయణ స్కూల్లో పుస్తకాల దోపిడీపై డీవైఎఫ్ఐ ఆందోళన అధిక ధరలకు పుస్తకాల విక్రయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Komidala Mahender reddy
నకిరేకల్, జూన్ 30:
నకిరేకల్లోని నారాయణ స్కూల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ డీవైఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతూ పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తోందని వారు విమర్శించారు.ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ, విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను దోచుకోవడం సరికాదని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంల పేరుతో విద్యార్థుల కుటుంబాలపై అదనపు భారం మోపడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పాఠశాలలో జరుగుతున్న పుస్తకాల విక్రయాలపై విచారణ నిర్వహించి, అధిక ధరల వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్, కార్యదర్శి ముసుకు రవీందర్, డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్, నాయకులు బొడ్డుపల్లి నరేష్, శశికుమార్, శివప్రసాద్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి