టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు... డివైడర్ దాటి లారీని ఢీకొట్టిన ఘోర ప్రమాదం
టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు... డివైడర్ దాటి లారీని ఢీకొట్టిన ఘోర ప్రమాదం
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా, కట్టంగూరు:
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో భీమవరం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.
అదుపుతప్పిన బస్సు రోడ్డు డివైడర్ను దాటి ఎదురుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమవగా, డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్ కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
అయితే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం ఊరటనిచ్చే అంశంగా నిలిచింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ప్రమాదానికి టైర్ పేలడమే ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగగా, పోలీసులు వాహనాలను పక్కదారి మళ్లించి రాకపోకలను పునరుద్ధరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి