Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు... డివైడర్ దాటి లారీని ఢీకొట్టిన ఘోర ప్రమాదం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 08:55 AM

టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు... డివైడర్ దాటి లారీని ఢీకొట్టిన ఘోర ప్రమాదం

టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు... డివైడర్ దాటి లారీని ఢీకొట్టిన ఘోర ప్రమాదం

టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు... డివైడర్ దాటి లారీని ఢీకొట్టిన ఘోర ప్రమాదం
June 30, 2026 07:29 AM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా, కట్టంగూరు:

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో భీమవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.

అదుపుతప్పిన బస్సు రోడ్డు డివైడర్‌ను దాటి ఎదురుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమవగా, డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్ కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

అయితే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం ఊరటనిచ్చే అంశంగా నిలిచింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ప్రమాదానికి టైర్ పేలడమే ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, పోలీసులు వాహనాలను పక్కదారి మళ్లించి రాకపోకలను పునరుద్ధరించారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News