PRINT TIME: June 29, 2026 09:25 PM
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం.. పోలీసు బృందాన్ని అభినందించిన ఎస్పీ
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం.. పోలీసు బృందాన్ని అభినందించిన ఎస్పీ
June 29, 2026 07:55 PM
113 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడు పడ్మటి అశోక్ రెడ్డి (32)కు సంగారెడ్డి నాల్గవ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.2,200 జరిమానా విధించింది. భూమి అమ్మకం విషయంలో తలెత్తిన వివాదంతో తన తండ్రి పడ్మటి మాధవరెడ్డిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో పటిష్టమైన సాక్ష్యాలను సేకరించి న్యాయస్థానంలో సమర్పించగా, ప్రభుత్వ న్యాయవాది సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో నిందితుడికి శిక్ష పడింది. ఈ కేసులో కృషి చేసిన దర్యాప్తు అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ న్యాయవాదిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి