Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

సై లార్క్ ఆసుపత్రి మరో ఘన విజయం.. తొలి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స సఫలం

సై లార్క్ ఆసుపత్రి మరో ఘన విజయం.. తొలి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స సఫలం

సై లార్క్ ఆసుపత్రి మరో ఘన విజయం.. తొలి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స సఫలం
29-06-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి మెదక్ జిల్లాలోని వెనుకబడిన నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు ఇప్పటివరకు మెరుగైన వైద్య సేవల కోసం బీదర్, సంగారెడ్డి, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. అత్యవసర పరిస్థితుల్లో కూడా దూర ప్రాంతాలకు ప్రయాణించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే ఇప్పుడు నారాయణఖేడ్‌లోని సై లార్క్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు ఎంతో ఊరట లభిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఎముకల వైద్య నిపుణుడు డాక్టర్ పి. రోహిత్ రాథోడ్ ఆధ్వర్యంలో 60 సంవత్సరాల వృద్ధురాలికి పూర్తి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిత్ రాథోడ్ మాట్లాడుతూ నారాయణఖేడ్ వంటి మారుమూల ప్రాంతంలోనే ఈ తరహా శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలకు సువర్ణ అవకాశమని, ఇకపై మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సై లార్క్ ఆసుపత్రిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసుపత్రిలో నిర్వహించిన తొలి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కావడానికి సహకరించిన వైద్యులు, నిర్వహణ బృందం, ఆసుపత్రి సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివ, నిర్వహణ సంచాలకుడు బేమర రవికిరణ్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సై లార్క్ ఆసుపత్రి మరో ఘన విజయం.. తొలి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స సఫలం

Article Image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని వెనుకబడిన నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు ఇప్పటివరకు మెరుగైన వైద్య సేవల కోసం బీదర్, సంగారెడ్డి, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. అత్యవసర పరిస్థితుల్లో కూడా దూర ప్రాంతాలకు ప్రయాణించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే ఇప్పుడు నారాయణఖేడ్‌లోని సై లార్క్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు ఎంతో ఊరట లభిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఎముకల వైద్య నిపుణుడు డాక్టర్ పి. రోహిత్ రాథోడ్ ఆధ్వర్యంలో 60 సంవత్సరాల వృద్ధురాలికి పూర్తి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిత్ రాథోడ్ మాట్లాడుతూ నారాయణఖేడ్ వంటి మారుమూల ప్రాంతంలోనే ఈ తరహా శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలకు సువర్ణ అవకాశమని, ఇకపై మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సై లార్క్ ఆసుపత్రిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసుపత్రిలో నిర్వహించిన తొలి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కావడానికి సహకరించిన వైద్యులు, నిర్వహణ బృందం, ఆసుపత్రి సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివ, నిర్వహణ సంచాలకుడు బేమర రవికిరణ్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News