భూ వివాదం బలిగొన్న బంధం.. తల్లిని హత్య చేసి కుమారుడు ఆత్మహత్య
భూ వివాదం బలిగొన్న బంధం.. తల్లిని హత్య చేసి కుమారుడు ఆత్మహత్య
Komidala Mahender reddy
పెద్దరావులపల్లిలో విషాద ఘటన.. గ్రామంలో తీవ్ర కలకలం
భూదాన్ పోచంపల్లి, జూన్ 29:
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ బంధాలను మరిచిపోయేలా జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
గ్రామస్తులు, పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు గ్రామానికి చెందిన సంగం శ్రీనివాస్ తన తల్లి సంగం పోచమ్మను రాయితో కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం తాను ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘటన విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తల్లి, కుమారుడు మృతదేహాలు ఒకే ఇంట్లో కనిపించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ప్రాథమిక విచారణలో భూ వివాదమే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు.
ఈ ఘటనతో పెద్దరావులపల్లి గ్రామం విషాదంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రావొద్దని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి