లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం:మాజీ గవర్నర్ తీగల మోహన్ రావు
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం:మాజీ గవర్నర్ తీగల మోహన్ రావు
K.RAVI
ఘనంగా లయన్స్ క్లబ్ ‘సేవ’ ప్రమాణ స్వీకారం
సమాజ సేవలో ముందుంటూ చౌటుప్పల్ లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని లయన్స్ క్లబ్ నల్లగొండ జిల్లా మాజీ గవర్నర్ తీగల మోహన్ రావు కొనియాడారు. సోమవారం వలిగొండ రోడ్డులోని లయన్స్ భవనంలో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ ‘సేవ’ 11వ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆసుపత్రి నిర్మించి, వేలాది మందికి ఉచిత పరీక్షలు చేయడం జిల్లాలోనే మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడిగా ఎండి. అత్తార్ పాషా, కార్యదర్శిగా దాచేపల్లి రాజు, కోశాధికారిగా బత్తిని రఘులతో ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోడె సతీష్ ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్లో సభ్యురాలిగా ఉండడం తన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా, పోలోజు శ్రీనివాస చారి, గోషిక కరుణాకర్, మొగుదాల రమేష్, బాచుపల్లి రవీందర్, తిరందాస్ జగన్నాథ్, సిలివేరు మంగయ్య, ఉప్పు ఆంజనేయులు, నాంపల్లి రమేష్, కొసనం రాంరెడ్డి, కాసుల వెంకటేశం, కటకం ప్రశాంత్, కామిశెట్టి చంద్రశేఖర్, తిరుమలరెడ్డి, గోపగొనీ లక్ష్మణ్, దాచేపల్లి శ్రీను, భాస్కర్ రెడ్డి, పనిందర్, పోలోజు రాజు, శ్రీనివాస చారి, వనం రాజు, వేముల నరసింహ, సత్యనారాయణ చారి, కాంశెట్టి భాస్కర్, అనిల్, ప్రతాపరెడ్డి, సంపూర్ణ చారి పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి