Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 AM

నల్గొండ సభలో కలకలం.. సీఎం స్టేజీపై రాజకీయ రగడ!

నల్గొండ సభలో కలకలం.. సీఎం స్టేజీపై రాజకీయ రగడ!

నల్గొండ సభలో కలకలం.. సీఎం స్టేజీపై రాజకీయ రగడ!
29-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


నల్గొండ, జూన్ 28: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న నల్గొండ బహిరంగ సభలో అనూహ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభా వేదికపై చోటుచేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి.

సమాచారం ప్రకారం, నల్గొండ మేయర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిని సీఎంవో భద్రతా సిబ్బంది స్టేజీ వద్ద అడ్డుకోవడంతో వివాదం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిని కలిసేందుకు, సన్మానం చేసేందుకు ప్రయత్నించిన సమయంలో భద్రతా సిబ్బంది నెట్టివేశారని ఆరోపిస్తూ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.సభ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి వేదిక నుంచి దిగిన వెంటనే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సీఎంవో భద్రతా సిబ్బందితో బుర్రి శ్రీనివాస్ రెడ్డి వాగ్వాదానికి దిగగా, కొంతసేపు తోపులాట వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ ఉన్న నాయకులు, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఇదిలా ఉండగా, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు సభా ఏర్పాట్లలో తగిన ప్రాధాన్యం కల్పించలేదనే అసంతృప్తి కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. పున్నా కైలాష్ నేతను సమావేశానికి దూరంగా ఉంచేందుకు ప్రత్యర్థి వర్గం ప్రయత్నించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.విశేషమేమిటంటే, సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పున్నా కైలాష్ నేత సేవలను ప్రశంసించినప్పటికీ, మరోవైపు ఆయన వర్గానికి చెందిన నేతలు సీఎంను కలిసే అవకాశాన్ని కోల్పోయారని అనుచరులు వాపోతున్నారు. గుమ్ముల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సభ విజయవంతంగా ముగిసినా, వేదికపై చోటుచేసుకున్న ఈ ఘటనలు కాంగ్రెస్‌లోని వర్గపోరును మరోసారి వెలుగులోకి తెచ్చాయి. ఈ ఘటనపై పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Sthanikam

నల్గొండ సభలో కలకలం.. సీఎం స్టేజీపై రాజకీయ రగడ!

Article Image


నల్గొండ, జూన్ 28: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న నల్గొండ బహిరంగ సభలో అనూహ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభా వేదికపై చోటుచేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి.

సమాచారం ప్రకారం, నల్గొండ మేయర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిని సీఎంవో భద్రతా సిబ్బంది స్టేజీ వద్ద అడ్డుకోవడంతో వివాదం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిని కలిసేందుకు, సన్మానం చేసేందుకు ప్రయత్నించిన సమయంలో భద్రతా సిబ్బంది నెట్టివేశారని ఆరోపిస్తూ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.సభ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి వేదిక నుంచి దిగిన వెంటనే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సీఎంవో భద్రతా సిబ్బందితో బుర్రి శ్రీనివాస్ రెడ్డి వాగ్వాదానికి దిగగా, కొంతసేపు తోపులాట వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ ఉన్న నాయకులు, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఇదిలా ఉండగా, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు సభా ఏర్పాట్లలో తగిన ప్రాధాన్యం కల్పించలేదనే అసంతృప్తి కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. పున్నా కైలాష్ నేతను సమావేశానికి దూరంగా ఉంచేందుకు ప్రత్యర్థి వర్గం ప్రయత్నించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.విశేషమేమిటంటే, సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పున్నా కైలాష్ నేత సేవలను ప్రశంసించినప్పటికీ, మరోవైపు ఆయన వర్గానికి చెందిన నేతలు సీఎంను కలిసే అవకాశాన్ని కోల్పోయారని అనుచరులు వాపోతున్నారు. గుమ్ముల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సభ విజయవంతంగా ముగిసినా, వేదికపై చోటుచేసుకున్న ఈ ఘటనలు కాంగ్రెస్‌లోని వర్గపోరును మరోసారి వెలుగులోకి తెచ్చాయి. ఈ ఘటనపై పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News