Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రాణదాతలుగా నిలిచిన రాయిపల్లి యువత.. విజయవంతమైన రక్తదాన శిబిరం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 29, 2026 09:19 PM

ఆత్మసాక్షాత్కార మహోత్సవం.. రమణేశ్వరంలో ఆధ్యాత్మిక వైభవం

ఆత్మసాక్షాత్కార మహోత్సవం.. రమణేశ్వరంలో ఆధ్యాత్మిక వైభవం

ఆత్మసాక్షాత్కార మహోత్సవం.. రమణేశ్వరంలో ఆధ్యాత్మిక వైభవం
June 29, 2026 07:55 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సిద్ధగురు రమణానంద మహర్షి 31వ ఆత్మసాక్షాత్కార దినోత్సవ వేడుకలకు భక్తుల పోటెత్తిన జనసంద్రం


ఆధ్యాత్మిక చైతన్యానికి నిలయంగా పేరుగాంచిన భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని రమణేశ్వరం ఆదివారం భక్తిజన సంద్రంగా మారింది. జగద్గురు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి 31వ ఆత్మసాక్షాత్కార మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, వేద మంత్రోచ్చారణల నడుమ ఘనంగా నిర్వహించబడ్డాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.

ఉదయం నుంచే రమణేశ్వరం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సిద్ధగురు ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఏకాగ్రతతో ధ్యానసాధన నిర్వహించగా, అనంతరం శ్రీచక్ర మహాలయంలో ప్రత్యేక పూజలు, బంగారు శివలింగానికి మహాభిషేకం, హోమహవనాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమాల అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

‘ఆత్మదర్శనం అరుదైన దివ్యానుభూతి’

ఈ సందర్భంగా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ప్రసంగిస్తూ ఆత్మసాక్షాత్కారం యొక్క పరమార్థాన్ని వివరించారు. 1995 జూన్ 29న మాత పూర్ణానంద యోగిని వారి అనుగ్రహంతో శక్తిపాతం ద్వారా తనకు ఆత్మదర్శనం కలిగిందని, ఆ దివ్య అనుభూతి జీవితానికి దిశానిర్దేశం చేసిందని తెలిపారు.

ఆత్మదర్శనం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, జీవభావం వంటి అన్ని పరిమితులను అధిగమించి, సంకల్ప–వికల్పాలకు అతీతమైన దివ్య ప్రజ్ఞా స్థితిని అనుభవించడమని పేర్కొన్నారు. అలాంటి స్థితిని కోట్లలో ఒకరు మాత్రమే పొందగలరని వ్యాఖ్యానించారు.

గురుకృపతోనే ఆత్మసాక్షాత్కారం

కేవలం శాస్త్రాలు, వేదాలు అధ్యయనం చేయడం ద్వారా భాషా, బుద్ధిజ్ఞానం మాత్రమే లభిస్తుందని, నిజమైన ఆత్మసాక్షాత్కారం కోసం సద్గురువును ఆశ్రయించి గురుసేవ చేయాల్సిన అవసరం ఉందని సిద్ధగురు తెలిపారు. గురుకృపతోనే ఆధ్యాత్మిక సాధన పరిపక్వమై ఆత్మదర్శనం సిద్ధిస్తుందని భక్తులకు సందేశమిచ్చారు.

ఈ మహోత్సవంలో పండిత్ గోపదేవ గారి ప్రముఖ శిష్యుడు శ్రీ మసన చెన్నప్పతో పాటు పలువురు ఆధ్యాత్మిక ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ధ్యానం, గురుభక్తి, వైదిక సంప్రదాయాలు, ఆధ్యాత్మిక సందేశాల సమ్మేళనంగా సాగిన ఈ వేడుక భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కార్యక్రమం ముగిసే వేళ సిద్ధగురు ఆశీస్సులు పొందిన భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News