Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం.. పోలీసు బృందాన్ని అభినందించిన ఎస్పీ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 29, 2026 08:18 PM

కేజీబీవీల్లో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు.

కేజీబీవీల్లో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు.

కేజీబీవీల్లో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి.  విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు.
June 29, 2026 06:53 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పెండింగ్‌లో ఉన్న నిర్మాణ, మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేసి విద్యార్థినులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్‌లో జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతితో కలిసి కేజీబీవీ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో పూర్తికాని పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, కాంపౌండ్ వాల్, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. పాఠశాలల పరిసరాల్లో వీధి కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా గడువులోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.

సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News