కేజీబీవీల్లో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు.
కేజీబీవీల్లో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు.
Editor Desk
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పెండింగ్లో ఉన్న నిర్మాణ, మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేసి విద్యార్థినులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతితో కలిసి కేజీబీవీ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో పూర్తికాని పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, కాంపౌండ్ వాల్, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. పాఠశాలల పరిసరాల్లో వీధి కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా గడువులోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.
సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి