Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:53 AM

కేజీబీవీల్లో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు.

కేజీబీవీల్లో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు.

కేజీబీవీల్లో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి.  విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు.
29-06-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పెండింగ్‌లో ఉన్న నిర్మాణ, మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేసి విద్యార్థినులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్‌లో జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతితో కలిసి కేజీబీవీ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో పూర్తికాని పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, కాంపౌండ్ వాల్, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. పాఠశాలల పరిసరాల్లో వీధి కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా గడువులోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.

సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

కేజీబీవీల్లో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు.

Article Image

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పెండింగ్‌లో ఉన్న నిర్మాణ, మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేసి విద్యార్థినులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్‌లో జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతితో కలిసి కేజీబీవీ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో పూర్తికాని పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, కాంపౌండ్ వాల్, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. పాఠశాలల పరిసరాల్లో వీధి కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా గడువులోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.

సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News