PRINT TIME: June 29, 2026 10:06 PM
ప్రాణదాతలుగా నిలిచిన రాయిపల్లి యువత.. విజయవంతమైన రక్తదాన శిబిరం
ప్రాణదాతలుగా నిలిచిన రాయిపల్లి యువత.. విజయవంతమైన రక్తదాన శిబిరం
June 29, 2026 08:47 PM
31 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం రాయిపల్లి గ్రామంలో యూత్ ఫర్ హ్యుమానిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానం పట్ల అవగాహన పెంచడం, అత్యవసర సమయాల్లో రక్త కొరతను నివారించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 25 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. రక్తదానం మహాదానం అని, ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాకీర్, అసద్, హశం, అహ్మద్, రెహ్మాన్, ఇర్ఫాన్, అమీర్, ఇస్మాయిల్, ఓం ప్రకాష్, ప్రశాంత్, జుబేర్, రిజ్వాన్, అమన్, ఆసిఫ్ తదితరులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి