బీసీలను, పద్మశాలీలను చిన్నచూపు చూస్తే కాంగ్రెస్కు తగిన గుణపాఠం తప్పదు!
బీసీలను, పద్మశాలీలను చిన్నచూపు చూస్తే కాంగ్రెస్కు తగిన గుణపాఠం తప్పదు!
K.RAVI
* యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు దోర్నాల గజేందర్ నేత
బీసీలు, పద్మశాలి నాయకుల పట్ల అవమానకరంగా వ్యవహరించే వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరని పద్మశాలి యువజన సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు దోర్నాల గజేందర్ నేత, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పెండెం ధనంజయ నేత ఈ మేరకు ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీసీలు, పద్మశాలి నాయకులను గౌరవించకుండా మాట్లాడటం అత్యంత బాధాకరమని వారు పేర్కొన్నారు. నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ అధికారిక సమావేశంలో పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు పున్న కైలాష్ నేత ఫోటోను ఫ్లెక్సీలలో వేయకపోవడం వారి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. బీసీ నాయకులకు, పద్మశాలి సమాజానికి కనీస విలువ ఇవ్వని నాయకత్వాన్ని ప్రజలు ఎవరూ అంగీకరించబోరని వారు స్పష్టం చేశారు."ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీసీలు, పద్మశాలి వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు వ్యవహరించినా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదు."కాంగ్రెస్ పార్టీలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇలాగే వదిలేస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులకు తమ సామాజికవర్గం నుండి ఎలాంటి మద్దతు ఉండదని నేతలు హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో పద్మశాలి సమాజం అంతా ఏకమై తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకత్వం బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, పద్మశాలి సమాజానికి రాజకీయంగా తగిన ప్రాధాన్యత, గౌరవం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి