గుండ్రంపల్లి పాల సంఘం అధ్యక్షురాలిగా శైలజ మహేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
గుండ్రంపల్లి పాల సంఘం అధ్యక్షురాలిగా శైలజ మహేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా, చిట్యాల మండలం:
గుండ్రంపల్లి పాల ఉత్పత్తి సహకార సంఘం అధ్యక్షురాలిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పోల్రెడ్డి శైలజ మహేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆమెను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు శైలజ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, సంఘం అభివృద్ధి, రైతులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేసి ఆదర్శ సహకార సంఘంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.అనంతరం ఆమెకు గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, సంఘం డైరెక్టర్లు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మి ప్రసన్న, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాచకొండ కిష్టయ్య, కోయగూర నర్సింహా, బీమిడి చిన్న వెంకట్ రెడ్డి, గోపగోని నర్సింహా, రెడపాక సురేష్, మహ్మద్ వాజీద్, బోడిగే రవీందర్, బోడిగే సాయి పాల్గొన్నారు. అలాగే సంఘం డైరెక్టర్లు గోపగోని హేమలత, కంకల పద్మ, రత్నం అండాలు, అచ్చిన అంజమ్మ, కొత్త లింగమ్మ, గోపగోని శెట్టి, రెడిపాక బాబుతో పాటు పలువురు సభ్యులు హాజరయ్యారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి